మందులు లేకుండానే మలబద్ధకం తగ్గేందుకు డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు చెప్పినట్లు తినండి, కడుపు మొత్తం క్లీన్ అవుతుంది
కాన్స్టిపేషన్ సమస్య ఉంటే దేనిపై కూడా కాన్సంట్రేట్ చేయలేరు. మలవిసర్జన సరిగా జరదు. రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. బాడీ బరువు, నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్య నేటి కాలంలో కామన్ అయిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఫైబర్ సరిపడినంతగా తినకపోవడం, వర్కౌట్ చేయకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, ఒత్తిడి ఇవన్నీ కూడా మలబద్ధకానికి కారణాలే. ఈ సమస్యని కంట్రోల్ చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అందులో ఒక పండు హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు రామ్దేవ్ బాబా. అదే రెడ్ డ్రాగన్ ఫ్రూట్. దీనిని తినడం వల్ల సమస్య ఎలా తగ్గుతుందో తెలుసుకోండి.
మలబద్ధకానికి పండుతో చెక్
రీసెంట్గా రామ్దేవ్ బాబా ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో మలబద్ధకంతో బాధపడేవారికి డ్రాగన్ ఫ్రూట్ హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. ఈ పండు మలబద్ధకం సమస్యకి ఔషధంలా పనిచేస్తుందన్న ఆయన ప్రేగు కదలికలకి ఈ పండు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే
సాధారణంగా, మలబద్ధకం తగ్గేందుకు సరైన పోషకాహారంతో పాటుమంచి లైఫ్స్టైల్ ఫాలో అవ్వాలి. ఇలా చేయనప్పుడే సమస్య వస్తుంది. దాంతో చాలా మంది సమస్య పరిష్కారానికి మందులు తీసుకుంటారు. అయితే, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే సమస్య తగ్గుతుంది.
రక్తహీనతకి మేలు చేసే పండు
అయితే, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మలబద్ధకం దూరమవ్వడమే కాదు. ఇందులో ఐరన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, దీనిని రెగ్యులర్గా తీసుకున్నప్పుడు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా, ఆడవారు ఈ పండుని తింటే అనీమియా వంటి సమస్యలు ఉండవు. నేచురల్గానే సమస్య తగ్గుతుంది.
ఎలా పనిచేస్తుంది?
ఆరోగ్య నివేదికల ప్రకారం డ్రాగన్ ఫ్రూట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన బాడీలోకి నీటిని లాగుతుంది. మలం కూడా మృదువుగా మారుతుంది. దీంతో ప్రేగు కదలికలు మెరుగ్గా మారతాయి. అంతేకాకుండా, ఇందులో ప్రీయోటిక్ ఉంటుంది. ఫైబర్ పేగులలో మంచి బ్యాక్టీరియాని పెంచుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. ప్రతిరోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే కొన్ని రోజుల్లోనే మలబద్ధకం తగ్గుతుంది.
ఎలా తినాలి
అయితే, ఈ పండు తినడానికి కూడా ఓ పద్ధతి ఉంది. డ్రాగన్ ఫ్రూట్ని ఉప్పు చల్లి తినడం వల్ల మరింత ఎఫెక్టివ్గా చేస్తుంది. రాతి ఉప్పు జీర్ణ ఎంజైమ్స్ని సక్రియం చేసి, గ్యాస్, అసిడిటీని తగ్గిస్తుంది. దీంతో మందులు వాడకుండానే కడుపు క్లీన్ అయి జీర్ణక్రియ మెరుగ్గా మారతుంది. కాబట్టి, మీరు మీ ఆహారంలో డ్రాగన్ ఫ్రూట్ని చేర్చుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa