ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZPTC ఉప ఎన్నికపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 11:38 AM

AP: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైసీపీ ఫిర్యాదు చేసింది. విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల, ఒంటిమిట్టలో ఇలాంటి ఎన్నికల పోలింగ్ ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గూండాలను తీసుకొచ్చి రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని, పోలీసులు కూడా వారితో చేతులు కలిపారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించాలని నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa