పాక్ నేతలకి మిథున్ చక్రవర్తి కౌంటర్
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన యుద్ధసదృశ వ్యాఖ్యలపై భారత బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మండిపడ్డారు. భారత్తో యుద్ధం రావొచ్చు అన్న బిలావల్ వ్యాఖ్యలను ఆయన పిచ్చిప్రేలాపనలుగా అభివర్ణించారు. మిథున్ తనదైన శైలిలో, దేశభక్తితో కూడిన స్పందన ఇచ్చారు.
'తిక్క రేగితే బ్రహ్మోస్ వర్షం'
ఇలాంటి బండబ్లఫ్లపై స్పందించిన మిథున్, “మాకు తిక్క రేగిందంటే వరుసగా బ్రహ్మోస్ క్షిపణులు వర్షంలా కురిపిస్తాం” అంటూ గట్టి హెచ్చరిక జారీ చేశారు. భారత్ తలదించుకునే దేశం కాదని, అవసరమైతే సైనికంగా గట్టి సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు.
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై ఘాటు స్పందన
ఇతర పాక్ నేతల వాఖ్యలు కూడా మిథున్ ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రత్యేకంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన "భారత డ్యాములు కూల్చేస్తాం" అన్న ప్రకటనపై మిథున్ ఘాటుగా స్పందించారు. భారత భద్రతా వ్యవస్థను తక్కువ అంచనా వేయొద్దని, ప్రతి హెచ్చరికకు శక్తివంతమైన ప్రతిస్పందన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
భారత శక్తిని చులకనచేయొద్దని హెచ్చరిక
సైనికంగా భారత్ ఎంత బలంగా ఉందో ప్రపంచమే తెలుసుకుందని మిథున్ పేర్కొన్నారు. శాంతిని కోరే దేశమైనా, అవసరమైతే దాడికి ఎదురుదెబ్బ ఇచ్చే శక్తి భారత్కి ఉందని ఆయన గుర్తు చేశారు. పాక్ నేతలు తమ మాటలు మితిమీరి మాట్లాడకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa