మధ్య బంగాళాఖాతం పై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, ఇది రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో వచ్చే ఆరు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది.
ఈ రోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. రేపటి నాటికి వర్షపాతం తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రేపు ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. తీర ప్రాంతాల్లో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈదురు గాలులు మరియు అధిక వర్షపాతం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించబడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa