జమ్మూ కశ్మీర్లో మరోసారి ప్రకృతి ఆగ్రహం ప్రదర్శించింది. గురువారం కిష్త్వార్ జిల్లాలో ఘోర క్లౌడ్ బరస్ట్ సంభవించి భారీ ప్రాణ నష్టం కలిగించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ క్లౌడ్ బరస్ట్ మచైల్ మాతా యాత్ర మార్గంలో సంభవించింది. ప్రతి ఏడాది వేలాది భక్తులు హిమాలయ పర్వతాల్లోని పవిత్ర దేవస్థానం మాతా చండికి దర్శనానికి వెళ్తారు. ప్రమాదం సంభవించిన సమయంలో కూడా యాత్రికులు పెద్ద సంఖ్యలో మౌలించ్ వైపు ప్రయాణంలో ఉన్నారు. ఘటన అనంతరం యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది.
మృతుల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సభ్యులు కూడా ఉన్నారు. యాత్ర భద్రత కోసం విధుల్లో ఉన్న CISF సిబ్బందిలో కొందరు ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ముగ్గురు CISF జవాన్లు గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది. బాధితులను అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించారు. సహాయ చర్యల కోసం SDRF, స్థానిక పోలీసులు, వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడుగా ఉండనుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa