దేశవ్యాప్తంగా (ఆగస్టు 15) 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ, , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర, దేశ ప్రజలకు తమ శుభాకాంక్షలు తెలిపారు. దేశ సమగ్రత, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ సమైక్యంగా కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన స్వతంత్ర ప్రజాస్వామ్య సౌధం మన దేశం. మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది అంటే ఆ త్యాగధనుల ఆత్మార్పణల ఫలితమే. దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. నుదిటి సిందూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించి, వారిని పెంచి పోషిస్తున్న ముష్కరులను అన్ని విధాలుగా కట్టడి చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. రక్షణ , అంతరిక్ష రంగాల్లో అభేద్యమైన స్థాయికి మన భారతదేశం చేరుతున్నందుకు ప్రతి ఒక్కరం గర్విద్దాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృఢ నాయకత్వంలో రక్షణపరంగానే కాకుండా ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉంటూ అంతర్జాతీయంగా మూడో స్థానానికి చేరువయ్యాం. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండటం మన బాధ్యత జైహింద్అంటూ పవన్ కల్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa