ఆసియా కప్ 2025 సెలక్షన్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. కొన్ని రోజులుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఉన్న భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సాధించాడు. ఈసారి టీ20 ఫార్మాట్లో టోర్నీ జరగనుంది. దీంతో సూర్యకుమార్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. కానీ అతడి ఫిట్నెస్పై ఇటీవల సందేహాలు తలెత్తాయి. తాజాగా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో అతడు పాస్ అయ్యాడు.
ఐపీఎల్ 2025 తర్వాత సూర్యకుమార్ యాదవ్కు జర్మనీలో హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం.. ఎవరైనా క్రికెటర్ శస్త్రచికిత్స చేయించుకుంటే.. అతడిని మళ్లీ జట్టులోకి తీసుకునేముందు ఫిట్నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంటుంది. పాస్ కాకపోతే జట్టులో చోటు దక్కదు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)లో నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్లో సూర్యకుమార్ యాదవ్ పాస్ అయ్యాడు. దీంతో ఆసియాకప్లో అతడు ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.
ఆసియాకప్ 2025 కోసం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాల్గొంటాడు. సమావేశం తర్వాత ఆసియాకప్ కోసం భారత జట్టును ప్రకటిస్తారు. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియాకప్ 2025 జరగనుంది. యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్లుగా ఎవరు ఉంటారు? వికెట్ కీపర్ ఎవరు? వైస్ కెప్టెన్ ఎవరు? అనేది తేలాల్సి ఉంది. ఆసియాకప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు.
ఏ గ్రూప్లో ఎవరు?
8 టీమ్లను రెండు గ్రూప్లుగా విభజించారు.
గ్రూప్ ఏ: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హంకాంగ్
ఆసియా కప్ 2025లో టీమిండియా షెడ్యూల్..
10 సెప్టెంబర్: భారత్ vs యూఏఈ
14 సెప్టెంబర్: భారత్ VS పాకిస్థాన్
19 సెప్టెంబర్: భారత్ VS ఒమన్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa