ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరకట్నం వేధింపులకు వివాహిత బలి

national |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 02:47 PM

కర్ణాటకలో వరకట్న వేధింపులకు యువతి పెళ్ళైన కొన్ని నెలలకే శవమైంది. డెంకణీకోట తాలూకా కూటురు గ్రామానికి చెందిన గాయత్రికి 11 నెలల క్రితం హోసూరు గోకుల్‌నగర్‌కు చెందిన కదిరేషన్‌తో పెళ్లి జరిగింది. భర్త, అత్తమామలు కట్నం కోసం తీవ్రంగా వేధించడంతో బెంగళూరులో ఆగస్టు 13న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయంలోనే 40 తులాల బంగారం, రూ.6 లక్షలు ఇచ్చినా వారు మరింత డిమాండ్ చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు భర్త కదిరేషన్‌ను సోమవారం అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa