ఆసియా కప్కు భారత్ జట్టు ప్రకటించిన బీసీసీఐ
సెప్టెంబర్ 9న యూఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ముంబయిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టును వెల్లడించారు. గత సిరీస్ల మాదిరిగానే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగనున్నారు.
గిల్కు వైస్ కెప్టెన్ పదవి
జట్టులో ముఖ్యంగా ఊహించినట్లే ఓపెనర్ శుభ్మన్ గిల్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై స్పష్టత వచ్చింది. జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ మొదటగా గిల్ పేరు వెల్లడించడం గమనార్హం. ఇది గిల్కు బీసీసీఐ యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతంగా భావించవచ్చు.
అసలు అగార్కర్ ఎంపిక వేరేలా ఉండేదట
అయితే అంతా అంచనా వేసినట్టుగానే గిల్నే తొలి ఎంపికగా అగార్కర్ భావించలేదని, మరో ఆటగాడిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేయాలనుకున్నట్టు సమాచారం. అయితే తుది నిర్ణయం ముందు బీసీసీఐ హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ వ్యవహారాల్లో చేరడంతో పరిస్థితి మారినట్టు తెలుస్తోంది.
భీర్తో మారిన గేమ్ప్లాన్?
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత, జట్టు ఎంపికపై ఆయన అభిప్రాయాన్ని అగార్కర్ పరిగణలోకి తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో గిల్కు అవకాశం కల్పించి జట్టులో యువ నాయకత్వానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa