ప్రస్తుతం మన దేశంలో పండగల సీజన నడుస్తోంది. ఈనెలలోనే వినాయక చవితి, ఓనమ్ పండగలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు, 2025 నెలకు సంబంధించిన శాలరీ, వేతనాలు, పెన్షన్లు ముందస్తుగా విడుదల చేస్తామని తెలిపింది. అయితే, గణేశ్ చతుర్థి, ఓనమ్ పండగ సందర్భంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే ఈ అడ్వాన్స్ శాలరీ వస్తుందని తెలిపింది. రెండు రాష్ట్రాల ఉద్యోగులు, పెన్షనర్లకు పండగ ముందే వస్తుందని చెప్పవచ్చు. 5 రోజుల ముందుగానే ఖాతాలోకి డబ్బులు వస్తాయి.
మహారాష్ట్రలోని ఉద్యోగులకు ఎప్పుడొస్తాయి?
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆగస్టు, 2025 శాలరీలు ఆగస్టు 26, 2025 మగంళవారం రోజున విడుదల చేస్తామని తెలిపింది. గణపతి ఫెస్టివల్ సందర్భంగా డిఫెన్స్, పోస్ట్, టెలీకమ్యూనికేషన్స్ రంగాల్లో పని చేస్తున్న వారందరికీ అడ్వాన్స్గా ఖాతాలో డబ్బులు వేయనున్నట్లు తెలిపింది. గణేశ్ చతుర్థి ఆగస్టు 27, 2025 రోజున వస్తోంది. అంతకు ఒక రోజు ముందుగానే శాలరీ ఖాతాల్లో పడిపోనుంది. ఈ మేరకు ఆగస్టు 22, 2025 రోజునే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరండమ్ జారీ చేసింది.
కేరళలో రక్షణ శాఖ, తపాలా, టెలీకమ్యూనికేషన్స్ శాఖల్లో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు 2025 శాలరీని అడ్వాన్స్గా జారీ చేయనుంది కేంద్రం. ఓనమ్ ఫెస్టివల్ పురస్కరించుకుని ఆగస్టు 25, 2025 సోమవారం రోజున విడుదల చేయనుంది. ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఈ ఏడాది ఓనమ్ పండగ వస్తోంది. ఈ సందర్భంగా ముందస్తుగా శాలరీ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆగస్టు 21, 2025 రోజునే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరండం జారీ చేసింది.
అలాగే కేరళ రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగుల వేతనాలను కూడా పైన ఇచ్చిన తేదీల ప్రకారం ముందుగానే చెల్లించవచ్చని ఆర్థిక శాఖ విడుదల చేసిన సర్క్యులర్ పేర్కొంది. ఇంకా, జీతం, వేతనం, పెన్షన్ చెల్లింపులను ముందస్తు చెల్లింపులుగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.కేరళ, మహారాష్ట్రలోని అన్ని బ్యాంకుల చెల్లింపు శాఖల దృష్టికి ఈ సూచనలను తీసుకురావాలని, అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ భారతీయ రిజర్వ్ బ్యాంక్ను అభ్యర్థించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa