నటుడు విజయ్ దళపతి నాయకత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ తమిళనాడులో కొనసాగుతున్న పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఒక దారుణమైన ఘటన తర్వాత ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కుల వివక్షతో కూడిన పరువు హత్యలను అరికట్టడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ.. టీవీకే జనరల్ సెక్టరటీ అధవ్ అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత చట్టాలు ఇలాంటి క్రూరమైన నేరాలను అరికట్టడానికి సరిపోవడం లేదని టీవీకే ఈ పిటిషన్లో స్పష్టం చేసింది.
చెన్నైకి చెందిన 27 ఏళ్ల దళిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ కవిన్ సెల్వగణేష్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కవిన్ ఆధిపత్య వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చిని ఆమె సోదురడు సుర్జిత్ జులై 27వ తేదీన.. తిరునెల్వేలిలోని పాలయంకోట్టైలో ఒక ఆసుపత్రి బయట కవిన్ను దారుణంగా హత్య చేశాడు. సుర్జిత్ తల్లిదండ్రులు ఇద్దరూ రాష్ట్ర పోలీసు విభాగంలో సబ్-ఇన్స్పెక్టర్లుగా పని చేస్తున్నారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని సస్పెండ్ చేయగా.. సుర్జిత్ తండ్రి శరవణన్ను అరెస్టు చేశారు. ఈ ఘటన యావత్ తమిళనాడులో ఒక సంచలనంగా మారింది.
తెల్లజుట్టు వచ్చిందని బాధపడకండి, షాంపూ తర్వాత ఇప్పుడుచెప్పే నీటితో జుట్టుని క్లీన్ చేస్తే నేచురల్గానే జుట్టు నల్లబడుతుంది
ఈ హత్య తర్వాత రాష్ట్రంలో ఒక ప్రత్యేక చట్టం తీసుకు రావాలని విదుతలై చిరుతైగళ్ కట్చి (వీసీకే), సీపీఐ, సీపీఐ (ఎం) వంటి ఇతర రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. కవిన్ కేసు ఒక్కటే కాదు ఇలాంటి అనేక కేసులు నమోదు అవుతున్నాయని దళిత హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. మధురై కేంద్రంగా పని చేస్తున్న దళిత హక్కుల సంస్థ 'ఎవిడెన్స్' నివేదిక ప్రకారం.. 2015 నుంచి తమిళనాడులో కనీసం 80 కుల ఆధారిత పరువు హత్యలు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో నేర నిరూపణ రేటు చాలా తక్కువగా ఉంది.
పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్న కార్యకర్తలు ఈ విషయంపై పలు వాదనలను వినిపిస్తున్నారు. ఒక ప్రత్యేక చట్టం ఉంటే ఇలాంటి నేరాలకు సంబంధించిన సమాచారాన్ని కచ్చితంగా సేకరించడానికి వీలుంటుందని చెబుతున్నారు. అలాగే విచారణలను వేగవంతం చేయడం, సాక్షులకు రక్షణ కల్పించడం, పరువు హత్యలను ఒక ప్రత్యేక నేర విభాగంగా గుర్తించడం వంటి ప్రయోజనాలు ఉంటాయని వివరిస్తున్నారు. చూడాలి మరి ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa