పంజాబ్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఎమ్మెల్యేపై వచ్చిన అత్యాచారం ఆరోపణలతో మంగళవారం రోజు ఉదయం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తుండగా.. ఎమ్మెల్యే అనుచరులు వచ్చి ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈక్రమంలోనే పోలీసులపై కాల్పులు జరిపారు. ఎమ్మెల్యేకు కూడా గన్ ఇవ్వగా.. ఆయన కూడా పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఆపై అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగిందంటే?
పటియాలాలోని సనూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న హర్మీత్ పఠాన్మజ్రాపై.. జిరాక్పుర్కు చెందిన ఓ మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. ఈమేరకు ఎమ్మెల్యే హర్మీత్ సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తనకు విడాకులు అయ్యాయని చెబుతూ.. తనతో అక్రమ సంబంధం కొనసాగించాడని ఆరోపించింది. ఆ తర్వాత తనపై బెదిరింపులకు పాల్పడ్డట్లు వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. మంగళవారం రోజు ఉదయమే కర్నాల్ వెళ్లి మరీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.
యాసిడ్తో పనిలేదు టాయిలెట్ సీట్పై ఉన్న పసుపు మరకల్ని వదిలించే ఒకే ఒక చిట్కా, మరకలతో పాటు దుర్వాసన మాయం
జీపులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తుండగా.. మధ్యలో ఆయన అనుచరులు వచ్చారు. పోలీసుల వాహనాన్ని అడ్డుకుని కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే పఠాన్మజ్రాను తమవైపు లాక్కొని ఆయనకు కూడా ఓ తుపాకీ ఇచ్చారు. ఆపై ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ కూడా పోలీసులపై కాల్పులు జరిపారు. చివరకు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మరికొంత మంది పోలీసులను పిలిపించుకుని మరీ.. ఎమ్మెల్యే, ఆయన అనుచరులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.
సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్లే నాకీ గతి..
అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ తీవ్రంగా ఖిండించారు. ఇది తనపై జరిగిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. అరెస్టుకు ముందే ఫేస్బుక్లో ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆప్ సర్కారుపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్ వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయందని విమర్శించారు. ఢిల్లీలోని ఆప్ పంజాబ్ను చట్టవిరుద్ధంగా పాలిస్తోందని ఆరోపించారు.
అయితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లే తనను అరెస్ట్ చేయించారని హర్మీత్ పఠాన్మజ్రా అన్నారు. తన గొంతు నొక్కడానికే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. కానీ తాను మాత్రం ఇలాంటి వాటికి అస్సలే బెదరనని.. తాను చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది కచ్చితంగా చేస్తానని వివరించారు. ముఖ్యంగా ప్రజల తరఫున పోరాడేందుకు ఎప్పడూ సిద్ధంగానే ఉంటానని చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa