ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత మార్కెట్‌లోకి అమెరికా బ్రాండ్‌ ఎంట్రీ – కేవలం 600 యూనిట్స్‌కే బుకింగ్స్!

Technology |  Suryaa Desk  | Published : Tue, Sep 02, 2025, 10:03 PM

ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా, జూలై మధ్యలో భారతదేశంలో విక్రయాలు ప్రారంభించింది. ఇప్పటి వరకు కంపెనీ కేవలం 600 కార్లకు మాత్రమే బుకింగ్స్ స్వీకరించింది.అయితే ఈ ఏడాదిలో టెస్లా 350 నుంచి గరిష్టంగా 500 వాహనాలు మాత్రమే డెలివర్ చేయాలని భావిస్తోంది. తొలి బ్యాచ్ వాహనాలు సెప్టెంబర్ ప్రారంభంలో షాంఘై నుంచి భారత్ చేరుకోనున్నాయి.ప్రాథమికంగా ముంబై, ఢిల్లీ, పూణే, గురుగ్రామ్ నగరాల్లోనే డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా దేశంలోని మిగిలిన మెట్రో నగరాలకు విస్తరించనుంది. ఇప్పటికే కంపెనీ రెండు డీలర్‌షిప్‌లు ప్రారంభించగా, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
*టెస్లా మోడల్ Y
ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో టెస్లా అందిస్తున్న ఏకైక మోడల్ మోడల్ Y.ఎంట్రీ లెవల్ Model Y RWD ధర ₹59.89 లక్షలు (ఎక్స్-షోరూమ్).
-లాంగ్ రేంజ్ RWD వెర్షన్ ₹67.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.ఈ రెండు వేరియంట్ల డెలివరీలు 2025 మూడవ త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.స్టాండర్డ్ మోడల్ Y RWD 60 kWh బ్యాటరీతో ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.లాంగ్ రేంజ్ వేరియంట్ 75 kWh బ్యాటరీతో గరిష్టంగా 622 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది.రెండు మోడళ్లలోనూ దాదాపు 295 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేసే ఒకే ఎలక్ట్రిక్ మోటారు అమర్చబడింది.బేస్ RWD వెర్షన్ 0-100 km/h వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది.లాంగ్ రేంజ్ వెర్షన్ అదే వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో అందుకుంటుంది.వీటి గరిష్ట వేగం 201 km/h.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa