AP Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉందని, రాబోయే 24 గంటల్లో అది మరింత బలపడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.తదుపరి 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పారు.దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు.తీరప్రాంతాల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు.మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 88.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వజ్రపుకొత్తూరులో 80.7 మి.మీ., పలాసలో 70.5 మి.మీ., రావివలసలో 56.5 మి.మీ., మదనపురంలో 53.5 మి.మీ., హరిపురంలో 53 మి.మీ. వర్షం రికార్డు అయ్యింది.అదే సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 41.3 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 9.72 లక్షల క్యూసెక్కులుగా ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించామని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ఫ్లో, ఔట్ఫ్లో 3,52,772 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు పొంగిపొర్లే వాగులు, కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa