మహిళల వన్డే ప్రపంచకప్ 2025కి ముందు టీమిండియా జట్టులో మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. అంతకంటే ముందే ఆస్ట్రేలియాతో టీమిండియా మహిళల జట్టు వన్డే సిరీస్ ఆడనుంది. అయితే ఆసీస్తో సిరీస్తో పాటు ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది.
విశాఖపట్నంలో జరిగిన సన్నాహక శిబిరంలో వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా మోకాలికి గాయమైంది. దీంతో ఆమె ఆసీస్తో సిరీస్తో పాటు వన్డే ప్రపంచకప్కు సైతం దూరమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భాటియా.. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉందని వెల్లడించింది. ఆమె ప్లేసులో ఉమా ఛెత్రిని ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
సెప్టెంబర్ 30 నుంచి జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్.. హర్మన్ ప్రీత్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ప్రపంచకప్ కంటే ముందే భారత్.. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్.. సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో జరుగుతుంది. సెప్టెంబర్ 30 నుంచి వన్డే ప్రపంచకప్ కప్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న జరిగే ఫైనల్తో విజేత ఎవరో తేలిపోనుంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంక వేదికగా జరుగుతాయి. ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కడపకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి.. హైదరాబాద్ ప్లేయర్ అరుంధతి రెడ్డి చోటు దక్కించుకున్నారు.
మహిళల వన్డే ప్రపంచకప్కు భారత జట్టు:
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), స్నేహ్ రాణా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa