యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనున్న విషయం తెలిసిందే. టోర్నీ ప్రారంభానికి ఐదు రోజులు కూడా లేదు. ఇప్పటికే పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ జట్లు యూఏఈలో అడుగుపెట్టాయి. తాజాగా టీమిండియా సైతం యూఏఈకి బయలుదేరింది. అయితే ఈసారి జట్టులా కాకుండా ఆటగాళ్లు వ్యక్తిగతంగా యూఏఈకి పయనం అవుతున్నారు. ఈ మేరకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ .. ముంబై ఎయిర్పోర్ట్ నుంచి యూఏఈకి పయనం అయ్యాడు.
ఆసియాకప్ 2025 కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఉన్నాడు. ఆటగాళ్లంతా తమ తమ స్వస్థలాల నుంచి నేరుగా యూఏఈకి చేరుకోవాల్సి ఉంది. దీంతో గురువారం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, టీమిండియా హెడ్కోచ్ గౌతమ్ గంభీర్ యూఏఈ ఫ్లైట్ ఎక్కారు. ఇతర ప్లేయర్లు సైతం బయలుదేరుతున్నారు. సెప్టెంబర్ 5న టీమిండియా ప్లేయర్లంతో తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నారు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ తర్వాత సుమారు నెలరోజుల పాటు ఆటగాళ్లకు రెస్ట్ దొరికింది. ఇక ఆసియాకప్ నుంచి విరామం లేకుండా మ్యాచ్లు ఉన్నాయి.
ఆసియాకప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. టీ20 ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగుతోంది. 2023లో వన్డే ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్.. శ్రీలంకను చిత్తు చేసింది. ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ఆసియాకప్ కోసం భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, రింకూ సింగ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా.
ఆసియాకప్లో టీమిండియా షెడ్యూల్..
10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ
14 సెప్టెంబర్: భారత్ - పాకిస్థాన్
19 సెప్టెంబర్: భారత్ - ఒమన్
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa