రైతన్నలకు తోడుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9వ తేదీన చేపట్టనున్న ‘అన్నదాత పోరు’కు రైతులు తరలిరావాలని వైయస్ఆర్ సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అన్నదాత పోరుకు సంబంధించి పోస్టర్లను వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కష్టాలు వర్ణణాతీం. గత ఏడాది అతివృష్టి, అనావృష్టితో నష్టపోయారు. అనంతపురం జిల్లాలో గత ఖరీఫ్, రబీలో వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ ఏడాది ప్రకృతి కరుణ లేదు.. ప్రభుత్వ సహకారం లేదు. ఫలితంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. విత్తనాల నుంచి సరైన సమయంలో ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితి. బ్లాక్ మార్కెట్కు యూరియా తరలించారు. రూ.260 అమ్మాల్సిన యూరియా రూ.350 నుంచి రూ.400కు అమ్మే పరిస్థితి కల్పించారు. అనంతపురం జిల్లాలో 8.50 లక్షల ఎకరాలు సాగుభూమి ఉంటే సాగైంది 4.30 లక్షల ఎకరాలు మాత్రమే. గత ఏడాది కంటే ఎక్కువ యూరియా పంపించామని చెబుతున్నా ఇంకా యూరియా కొరత వేధిస్తోంది. యూరియా కోసం ఎక్కడ చూసినా రైతులు బారులు తీరుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లే యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించినా వారిపై చర్యలు శూన్యం. గత ఏడాది నష్టపోయిన పంటలకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అందజేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలపై రైతులు, ప్రతిపక్షాలు మాట్లాడితే జైళ్లో పెడతామని చెప్పడం దారుణం. రైతు సమస్యలపై వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఈనెల 9న తేదీన అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ర్యాలీలు చేసి ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేస్తాం.` అని అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa