ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టనున్న ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 07, 2025, 05:39 PM

దసరా ఉత్సవాలకు అదనపు శోభ తీసుకువచ్చేందుకు విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామని స్థానిక ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని వెల్లడించారు. ఆదివారం పోరంకిలో విజయవాడ ఉత్సవ్ కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. దేశమంతా ఈ ఉత్సవాలను చూపించాలనే ఉద్దేశ్యంతో విజయవాడ ఉత్సవ్‌ను చేపడుతున్నట్లు వివరించారు.ఇది ప్రజల సహకారంతో.. ప్రజల కోసం జరిగే కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవ్ ద్వారా వ్యాపార రంగంతో సహా మిగిలిన అన్ని రంగాలు మరింత అభివృద్ది జరిగేందుకు దోహదపడుతుందని ఎంపీ కేశినేని చిన్ని అభిప్రాయపడ్డారు. విజయవాడ అంటే వైబ్రెంట్ నగరమని అభివర్ణించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వ్యక్తులు లక్షల ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa