ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేద వైద్యవిద్యార్థులకి అన్యాయం చేసేందుకే చంద్రబాబు ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 08:25 AM

అవినీతి, దోపిడీ కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తోందని...  శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రయివేటు పరం చేయడం లేదని తేల్చి చెప్పారు. ప్రయివేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్ధులను మెడికల్ విద్యకు దూరం చేస్తూ వారి ఉసురుపోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతులకు బస్తా యూరియా ఇవ్వడం కూడా చేతకాని ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తే... కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న చంద్రబాబు వైఖరిని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa