ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలపై దృష్టి సారించిన సీఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 08, 2025, 09:05 AM

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టి సారించినట్లు సమాచారం.గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించారు. ఆదివారం కూడా ముఖ్య అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించారు. మొదటి విడత బదిలీల జాబితా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అధికారికంగా జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాథమికంగా సీనియర్ ఐఏఎస్ అధికారుల జాబితాలో శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్లు (ఎస్పీలు) వరుసగా బదిలీ అయ్యే అవకాశం ఉంది. తితిదేలోని కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు కూడా మార్పులు ఉండవచ్చు. అలాగే, సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులు కూడా బదిలీ జాబితాలో ఉన్నట్లు సమాచారం. విద్యుత్ పంపిణీ సంస్థల్లోనూ బదిలీలు ఖాయమని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa