ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకొని వచ్చిన సచివాలయం వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అనంతపురం మేయర్ వసీం సలీం పేర్కొన్నారు. నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలకంగా ఉంటుందని నొక్కి వక్కాణించారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో పట్టణ జీవనాన్ని మెరుగుపరచడంలో సాంకేతిక పాత్ర అనే అంశంపై సదస్సు ను ఇన్ఫో కాం ఇండియా మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అనంతపురం మేయర్ వసీం పాల్గొని ప్రసంగించారు. " స్మార్ట్ సిటీస్- పట్టణాల్లో జీవన ప్రమాణాలు మెరుగు" అనే అంశాల మీద ఒక ప్యానెల్ లో ఆయన వక్తగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొని వచ్చిన సచివాలయం వ్యవస్థ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సచివాలయం వ్యవస్థ ద్వారానే సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సాంకేతిక విజ్ఞానంతో ప్రజలకు సేవలు అందించే అవకాశం కల్పించారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa