ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుల సేవల నాణ్యతని పెంచుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 09:16 AM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ అన్నారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. పూర్వ ఈవో శ్యామలరావు నుంచి బాధ్యతలు తీసుకున్న ఆయనతో టీటీడీ బోర్డు మెంబర్‌ సెక్రటరీ ఎక్స్‌ అఫిషియోగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ సేకరించి సేవల నాణ్యతను పెంచుతామని చెప్పారు. అంతకుముందు సింఘాల్‌ అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని తలనీలాలు సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa