ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకి కనీసం వారి సమస్యలని తెలిపే హక్కుకూడా లేదా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 12:55 PM

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు ఈ నెల 9న త‌ల‌పెట్టిన అన్న‌దాత పోరు కార్య‌క్ర‌మం గ్రాండ్ స‌క్సెస్ అయ్యింద‌ని నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు. ఇందుకు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి కాకాణి ధ‌న్య‌వాదాలు తెలిపారు. నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలు, రైతు సంఘ నాయకులె శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, కోవూరు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు నల్లపురెడ్డి రజత్ కుమార్ రెడ్డి,  రైతు విభాగం నాయ‌కుల‌తో క‌లిసి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.... మా నాయకుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని రైతులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించాం.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంతో సహా, అన్ని నియోజకవర్గాలలో అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది.అన్నదాత పోరు కార్యక్రమానికి నెల్లూరు, కావలి, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, కందుకూరు రెవిన్యూ డివిజన్లలో పెద్ద ఎత్తున రైతులు పోటెత్తడం జరిగింది.కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్త్తుంది.ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంది.ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సంక్షేమం కోసం నిరసనలు చేస్తారు.కూటమి ప్రభుత్వం మొదటిసారిగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి కార్యక్రమాలను అడ్డుకోవాలని పోలీసులను ఉసగొలిపి ప్రజలు రాకుండా నిలువరించే ప్రయత్నం చేస్తుంది.అన్నదాత పోరు కార్యక్రమంలో కూడా పోలీసులను ఉపయోగించి రైతులను ప్రజలను కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని అడ్డుకోలేరని కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాన్నిచ్చారు.పోలీసులను ప్రయోగించి ప్రజలను అడ్డుకోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నిరసన వెలువెత్తుతుంది. అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతం కాకూడదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, రైతులను హౌస్ అరెస్టులు చేశారు.అన్నదాత పోరు కార్యక్రమంలో పోలీసులు ఉత్సాహం చూపించారు.ఐనప్పటికీ రైతులు భారీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa