ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులిని పట్టుకోవడంలో విఫలమైన అధికారులని శిక్షించిన గ్రామస్తులు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 11, 2025, 01:12 PM

కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా, గుండుల్‌పేట తాలూకాలోని బొమ్మలాపుర గ్రామంలో వింత సంఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం బండీపుర జాతీయ పార్క్ సమీపంలోని ఈ గ్రామంలో కొన్ని రోజులుగా ఓ పులి సంచరిస్తోంది. దీంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు నాలుగు రోజుల క్రితం ఒక బోనును ఏర్పాటు చేసి, అందులో ఎరగా ఓ దూడను కట్టేశారు. అయితే, బోను వద్దకు వచ్చిన పులి ఆ దూడను చంపి వెళ్లిపోయింది. ఈ విషయం జరిగి రోజులు గడుస్తున్నా, అధికారులు మంగళవారం వరకు ఆ ప్రాంతానికి రాలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అధికారుల అలసత్వంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బందిని చుట్టుముట్టారు. పులి కోసం పెట్టిన బోనులోనే వారిని బంధించి, తమ ఫోన్లలో వీడియోలు తీశారు. పులిని తక్షణమే పట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. సుమారు 15 నిమిషాల తర్వాత ఇతర గ్రామస్థులు, పోలీసులు, అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని బోనులో ఉన్న వారిని విడిపించారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఒకవేళ ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa