అనంతపురం జిల్లాలో కణేకల్లు-మాల్యం మధ్యలో వేదవతి నది ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కుషావతి, చిత్రావతి నదులు పరవళ్లు తొక్కాయి. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామ సమీపంలోని కోన రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద జలపాతం జీవం పోసుకుంది. కంది, వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కణేకల్లు మండలంలో 16 హెక్టార్లల్లో రూ.4.05 లక్షల విలువైన వరి పంట దెబ్బతింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 83.81 హెక్టార్లల్లో రూ.20.95 లక్షల విలువైన వేరుశనగ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గుత్తి, యాడికి మండలాల్లో 3.53 హెక్టార్లల్లో రూ.9 లక్షల విలువైన టమోటా పంట దెబ్బతింది. శింగనమల మండలం గోవిందరావు పేటలో 3 ఎకరాల్లో కోత కోసిన వేరుశగన పంట వర్షానికి కొట్టుకుపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa