ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరకు కాఫీ రైతులని ప్రభుత్వం ఆదుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 11:36 AM

అరకు కాఫీ రైతులకు  ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  రేగం మత్స్యలింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డుంబ్రీగుడ మండలం కొర్రయి పంచాయితీ గత్తెరజిల్లెడ, అరకువ్యాలీ మండలం పెదలబుడు పంచాయితీ గరడగూడ గ్రామాల్లో బెర్రీ బోరర్ సోకిన కాఫీ తోటలను ఎమ్మెల్యే ప‌రిశీలించారు.  ఈ సందర్భంగా రైతులు ఎంత నష్టపోయారో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సుమారు ఎకరానికి లక్ష రూపాయలు పైబడి ఆదాయం వస్తుందని అయితే బెర్రీ బోరర్ కీటకం సోకడంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రేటు ప్రకారం కేజీ రూ. 50 రూపాయలు ఎకరాకు రూ. 20 వేల రూపాయలు సరిపోదని తెలియజేశారు. మాకు కనీసం మద్దతు ధర కేజీ రూ.100 ఎకరాకి రూ. 1లక్ష రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. రైతులకు కనీస మద్దతు ధర కల్పించి కాపీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి , వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య, అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, డుంబ్రీగూడ మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురామ్, అరకులోయ మండల పార్టీ అధ్యక్షులు స్వాబి రామ్ మూర్తి , సర్పంచ్ లు కిముడు హరి , గుమ్మ నాగేశ్వరరావు , రామ్మూర్తి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచడి నరేష్, కిల్లో రాజారమేష్, చట్టారి కృష్ణారావు , కమ్మిడి అశోక్, పాంగి నరసింగరావు, బాకా సింహాచలం, కమ్మిడి విజయదశమి, మట్టం శంకర్, దామోదర్, రామ్మూర్తి , నర్సింగ్, వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్స్, పీజీ విద్యార్థులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa