ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించింది

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 07:01 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రముఖ గాయకుడు, భారతరత్న భూపేన్ హజారికాను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా అవమానించిందని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు. ఆదివారం అసోంలోని దర్రాంగ్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, "భూపేన్ హజారికాకు భారతరత్న ప్రకటించిన రోజు, 'పాటలు పాడేవారికి, డ్యాన్సులు చేసేవారికా మోదీ భారతరత్న ఇచ్చేది?' అని నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి" అని తెలిపారు. తనను ఎవరైనా దూషించినా తాను శివుడిలా విషాన్ని దిగమింగుతానని, కానీ ఈశాన్య ప్రజలు ఆరాధించే వ్యక్తిని అవమానిస్తే మాత్రం సహించలేనని ఆయన భావోద్వేగంగా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa