ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఆపాలంటున్న మనోజ్ తివారీ

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 07:00 PM

ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్, పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌ను నిలిపివేసే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ, వారు ఆ పని చేయలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇటీవల పహల్గామ్‌లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' చేపట్టిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటాన్ని ఆయన తప్పుబట్టారు. "ఈ మ్యాచ్ జరగడం అత్యంత దురదృష్టకరం. పుల్వామా నుంచి పహల్గామ్ వరకు ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. అయినా కూడా మనం వాళ్లతో మ్యాచ్ ఆడాల్సి వస్తోంది," అని తివారీ వాపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa