గతేడాది కూటమి ప్రభుత్వంలో విజయవాడలో ఇదే తరహాలో డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈసారి అదే పరిస్థితులు నెలకొన్నాయి. రాజధానిగా చెప్పుకునే విజయవాడలో వరుసగా ఇలాంటి పరిస్థితులు రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు. అయన మాట్లాడుతూ... గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. గ్రామ సచివాలయాల్లో వాటర్ టెస్టింగ్ కిట్లు ఇచ్చి ఎప్పటికప్పుడు తాగునీటిని టెస్టు చేసేవాళ్లం. ఇప్పుడా పరిస్ధితులు కనిపించడం లేదు. 40 అర్బన్ హెల్త్ సెంటర్లు, 5 వేల మంది శానిటరీ వర్కర్లు, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండి కూడా ఈ పరిస్థితులు ఉన్నాయంటే ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు ఇంకేం కావాలి? బాధితులు ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షల్లో ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో డయేరియా ప్రబలితే బాధితులకు కనీసం ఉచిత వైద్య సదుపాయాలు కూడా అందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంత కన్నా దారుణం ఇంకోటి ఉందా? ప్రజారోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ఇలా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టే మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నాడు. పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నాడు కానీ ఆ తప్పుల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రజారోగ్యాన్ని కాపాడలేకపోతే, ప్రభుత్వాన్ని నడపడం చేతకాకుంటే చంద్రబాబు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసి దిగిపోవాలి అని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa