ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాల చంద్రబాబు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 12:38 PM

వైయస్.జగన్ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ పనులను ప్రారంభిస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటీకరణ చేయాలన్న నిర్ణయంపై మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు నాయుడుకు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేస్తూ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు, మంత్రులు చెబుతున్న అబద్దాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి, ప్రజలు, మేధావులు వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అయన మాట్లాడుతూ.... బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం సామాజిక బాధ్యతగా పేదవాడికి అందించాల్సిన విద్య, వైద్యాన్ని ఎప్పటికప్పుడు విజయవంతంగా పక్కదారి పట్టించడం చంద్రబాబుకు అలవాటు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల దగ్గర నుంచి యూజర్ ఛార్జీల పేరిట ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప వారికి నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. పేదవాడు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలని.... మేం మాత్రం పెత్తనం చేయాలన్న ధోరణి చంద్రబాబుకు పుట్టుకతో వచ్చింది. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా చంద్రబాబుది కుక్కతోక వంకర బుద్ధి. ఎన్నికల ముందు ప్రజల నుంచి ఓట్లు దండుకోవడం కోసం కళ్లార్పకుండా  ప్రజలకు అబద్దపు హామీలివ్వడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa