గుంటూరు జిల్లా, తురకపాలెం మరణాలు నీటిలో యురేనియం కలవడం వల్ల సంభవించినవి కాదని ఆరోగ్యశాఖ స్పష్టంగా చెబుతోంది. నీటిలో యురేనియం 0.3 శాతంపైన ఉంటేనే ప్రమాదమని, తురకపాలెంలో సేకరించిన నీటిలో 0.001 శాతమే గుర్తించినట్లు తెలిపింది. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఉండదన్నారు. మరోవైపు ఆరోగ్యశాఖ పరిధిలో ఉండే నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. తురకపాలెంలో 29 మంది మరణిస్తే, విజయవాడ సింగ్నగర్లో 151 మంది డయేరియా బారినపడ్డారు. శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలోని కొన్ని గ్రామాల్లో ప్రజలకు అకస్మాత్తుగా మోకాళ్ల సమస్యలు వస్తున్నాయి. మొన్న పాడేరు సమీపంలోని కొన్ని గ్రామాల్లో వంద మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే ఆరోగ్యశాఖలోని ఐడీఎ్సపీ (ఇంటిగ్రేటేడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రొగ్రామ్) స్పందించి... వాటికి కారణాలు గుర్తించాలి. కానీ ఈ విషయంలో ఐడీఎ్సపీ వెనుకబడింది. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంల పనితీరు కూడా సక్రమంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో సర్వేలెన్స్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa