ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 ఏళ్లకు పింఛన్ పథకంపై శాసన మండలిలో చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 18, 2025, 11:45 AM

ఏపీ శాసనమండలిలో 50 ఏళ్లకు పైబడి పింఛన్ పథకంపై ప్రశ్నోత్తరాలు జరిగాయి. సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50–59 ఏళ్ల వయస్సు కలిగిన 11,98,501 మంది పింఛన్ పొందుతున్నారని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పేదల దినోత్సవం నిర్వహించి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలుగా ఒకేసారి పెంచామని మంత్రి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa