ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు తొలిగించింది నువ్వు కాదా చంద్రబాబు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 19, 2025, 01:30 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తొలగింపు, రేషన్ వాహనాలు, ప్రభుత్వ లిక్కర్ షాపులు రద్దు చేయడంతోపాటు ఆప్కాస్ లో పనిచేస్తున్న వేలాదిమందిని తమకు నచ్చని కారణంతో వేలాదిమందిని అధికార పార్టీ నాయకులు తొలగించారు అని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయన మాట్లాడుతూ... కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, అధికార పార్టీ నేతల చర్యలతో వేలాది మంది నిరుద్యోగులు రాష్ట్రంలో కనిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 50 వేల పోస్టులతో మెగా డియస్సీ నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదే డియస్సీని కేవలం రెండు నెలల్లో పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తే.. అది అమలు కాకుండా ఎన్నికలు వస్తున్నాయని కోర్టుకు వెళ్లు అడ్డుకున్నారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల పోస్టులకు సంబంధించి, డీయస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు 16 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి  సుమారు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది అభ్యర్ధులను అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేస్తూ 16 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. నియామక ప్రక్రియ పూర్తయింది, రేపు   అపాయింట్ మెంట్ ఆర్డర్స్ తీసుకొమ్మని చెబుతున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయి. సెలక్షన్స్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అపాయింట్ మెంట్స్ ఆర్డర్స్ జారీలో కూడా అవమానిస్తున్నారు.  నార్మలైజేషన్ ప్రొసెస్ వల్ల అభ్యర్ధులకు అన్యాయం జరిగింది. నార్మలైజేషన్  ప్రోసెస్ అంటే రకరకాల సెషెన్స్ లో పరీక్షలు జరుగుతాయి. ఒక సెషన్ లో యావరేజ్ మార్కులు తగ్గవచ్చు. మరొక సెషన్ లో యావరేజ్ మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది. తక్కువ యావరేజ్ మార్కులు వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉండి  ఉంటుందని, అందుకే వీరికి యావరేజ్ మార్కులు తగ్గాయని, ప్రభుత్వం తన ఇష్ట ప్రకారం వీరికి మార్కులు పెంచింది. వాస్తవంగా యావరేజ్ మార్కులు తగ్గడానికి కారణం..  తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉంటున్న వారందరూ మన రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల వద్దకు వచ్చి కేవలం అనుభవం కోసం పరీక్ష రాశారు. వాళ్లు సాధారణంగా ప్రిపేర్ కావడం ఆ సెంటర్లలో దరఖాస్తు చేసుకున్న చోట ఆ సెషన్స్ లో యావరేజ్ మార్కులు తగ్గాయి. అలా తగ్గిన చోట వారికి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి వారికి 4.7 మార్కులు వరకు పెంచి అదనంగా కలిపారు.  ఆ సెషన్స్ లో వచ్చిన వారికి అదనంగా మార్కులు కలవడం వల్ల మిగిలిన వారికి నష్టం జరిగింది. వాళ్లు అన్యాయం అయ్యారు. ఈ నార్మలైజేషన్ విధానంలో 01-07-2025 ఉదయం సెషన్ లో పరీక్ష రాసిన వారికి 0.75 మార్కులు యాడ్ చేశారు. అదే రోజు మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష రాసిన వారికి 4.75 మార్కులు యాడ్ చేశారు. 13-06-2025 సెకెండ్ షిఫ్ట్ లో రాసిన వారికి 4.25 మార్కులు చేర్చారు. కొన్ని సెషన్స్ లో 0.5, 0.75 మరికొన్ని సెషన్స్ లో 4.25 నుంచి 4.75 వరకు యాడ్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు యాడ్ చేసిన వారికే ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల కష్టపడి చదివిన చాలా మందికి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల వారికి అన్యాయం జరిగింది అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa