భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ షేర్లు ఈరోజు భారీగా ఎగసిపోయాయి. షేర్ల ధరలు ఆకాశాన్ని తాకుతూ భారీ వృద్ధిని చూపించాయి. ఇది ఒక్కటి కాదు, అనేక షేర్లలో కనిపించింది.అదానీ గ్రూప్కు చెందిన అన్ని షేర్లు భారీగా పెరిగి, మొత్తం మార్కెట్ క్యాప్ రూ.66,000 కోట్లు పెరిగింది. భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అదానీ గ్రూప్కు పూర్తి క్లీన్ చిట్ ఇచ్చింది.గతేడాది, అమెరికాలోని షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద హంగామా కలిగించాయి. అదానీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా మానిపులేట్ చేశారని, ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మోసాలు, పబ్లిక్ షేర్హోల్డింగ్ నిబంధనలు ఉల్లంఘించారని హిండెన్బర్గ్ ఆరోపణలు చేశారు. దీంతో అదానీ షేర్ల విలువలు ఒక్కసారిగా తీవ్రంగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయల మేరకు క్షీణించింది.కానీ, తాజాగా జరిగిన విస్తృత దర్యాప్తు తర్వాత సెబీ అదానీ గ్రూప్కు క్లీన్ చిట్ ఇచ్చింది. హిండెన్బర్గ్ ఆరోపణలకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు అని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ నిధులను ఇతర సంస్థల ద్వారా తిరిగి పెట్టుబడులు పెట్టారని ఉన్న ఆరోపణలకు కూడా ఆధారం దొరకలేదని తేల్చి చెప్పింది.మరియు అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు రాజేశ్ అదానీ, గ్రూప్ సీఫీఓ జుగీషిందర్ సింగ్ సహా ఇతరులు ఎటువంటి తప్పు జరగలేదని కూడా తెలిపింది. దీంతో మార్కెట్లో అదానీ షేర్ల విలువలలో భారీ పెరుగుదల కనిపించింది.ఈ పరిణామాలపై గౌతమ్ అదానీ సంతోషం వ్యక్తం చేశారు. హిండెన్బర్గ్ నివేదికలోని ఆరోపణలు తప్పు అని మొదటినుండి చెప్పారని, అవి ఉద్దేశపూర్వకంగా పెట్టుబడిదారులలో భయం, అనుమానం కలిగించేలా తయారుచేయబడ్డాయని చెప్పారు. తప్పుడు వార్తలను నమ్మి దేశ ఆర్థిక ప్రతిష్టకు హాని కలిగించేలా ప్రచారం చేసిన వారు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కలచి పట్టించిన వారు ఇప్పుడు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa