'ఓజీ' చిత్రం టికెట్ ధరల పెంపుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్'ఓజీ' మూవీ యూనిట్ విజ్ఞప్తిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ మేరకు అధికారికంగా జీవో విడుదల చేస్తూ, ప్రీమియర్ షోలకు అనుమతిచ్చింది. ఈ నెల 24వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు అవకాశం కల్పించింది.ప్రీమియర్ టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించింది. ఇక సినిమా విడుదలైన రోజైన సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు సాధారణ టికెట్ ధరల్లో కూడా పెంపును అనుమతించింది.ఈ కాలంలో సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరలను జీఎస్టీతో కలిపి రూ.100 వరకు, మల్టీప్లెక్స్లలో రూ.150 వరకు పెంచుకునే అవకాశం కల్పించిందని స్పష్టంచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa