భారత్లో పండగల సీజన్ మొదలైంది. దసరా పండగకు మరో వారం రోజులే ఉంది. ఈ క్రమంలో మార్కెట్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఆటోమొబైల్ వంటి కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్ ఫెస్టివల్ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు ప్రత్యేకమైన ఖుషియా అన్లిమిటెడ్ ఆఫర్స్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 1250కి పైగా ఆఫర్లు ప్రకటించింది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్స్, ఈఎంఐ వంటి ఆఫర్లు ఉన్నాయి. ఆన్లైన్ ప్లాట్ ఫామ్స్ సహా ఆఫ్లైన్ స్టోర్లలోనూ ఈ ఆఫర్స్ వర్తిస్తాయి.
దేశవ్యాప్తంగా మొత్తం 2900 పైగా సిటీల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లో ప్రత్యేకంగా ఖుషియాన్ అన్లిమిటెడ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్ తెలిపింది. ఫెస్టివల్ ఆఫర్లో భాగంగా కన్సూమర్ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, జువెలరీ, గ్రాసరీ వంటి వాటిపై భారీ డిస్కౌట్లు ఇస్తోంది. ప్రముఖ బ్రాండ్లు, షాపుల్లో ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఈఎంఐ ఆప్షన్ సైతం అందిస్తున్నారు. గరిష్ఠంగా రూ.51,500 వరకు తగ్గింపు పొందవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
పలు ఆఫర్లు ఇలా..
అమెజాన్లో ఎస్బీఐ కార్డు ద్వారా ఏది కొనుగోలు చేసినా ఇన్స్టాంట్ డిస్కౌంట్ 10 శాతంగా వస్తుంది.
యాపిల్ ఉత్పత్తులపై రూ.6000 ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ డిసెంబర్ 27 వరకు కొనసాగుతుంది.
బజాజ్ ఆటోలో కనీస ట్రాన్సాక్షన్ రూ.30 వేలు ఉంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
ఫ్యాషన్ ఫ్యాక్టరీలో కనీసం రూ.4000 కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.
హెయర్లో ఏదైనా కొనుగోలు చేసి ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే 25 శాతం వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
హెచ్పీ ఉత్పత్తుల కొనుగోలుపై ఒక్కో కార్డుకు గరిష్ఠంగా రూ.15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ ఉంటుంది. ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఎల్జీ ఉత్పత్తులపై 26 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ఉంటుంది.
సామ్సంగ్ కన్సూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు ఈఎంఐ ఆప్షన్ ద్వారా 27.5 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గరిష్ఠంగా రూ.51,500 వరకు పొందవచ్చు. సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంటుంది.
సోనీ ఉత్పత్తులపై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 30 వరకు అవకాశం.
రేమండ్ నేషనల్ ఉత్పత్తులపై రూ.7500 ఆపైన కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అక్టోబర్ 23 వరకు ఆఫర్ కొనసాగుతుంది.
వివో ఉత్పత్తుల కొనుగోలు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేస్తే రూ.15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa