భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు దీని పట్ల ఆకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా పండగల సమయాల్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. దేశంలో ఇప్పుడు ఈ సీజన్ రానే వచ్చింది. దసరా, దీపావళి పండగలకు చాలా ముందు నుంచే బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో రేట్లు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరాయి. మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసి ధరిస్తుంటారు. ఇటీవల బంగారం కేవలం అలంకరణగా మాత్రమే కాకుండా.. పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తుంది. ఇది సేఫ్ హెవెన్ అసెట్ కాబట్టి.. పెట్టుబడులపైనా జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఆపద సమయాల్లో ఆదుకుంటుందని భావించి పెట్టుబడులు పెడుతుంటారు. దీంతో ధరలు అలా పెరుగుతూ పోతూనే ఉన్నాయి.
ఇప్పుడు దేశంలో నవరాత్రుల శోభ నెలకొంది. మరికొద్ది రోజుల్లో దీపావళి రానే వస్తుంది. ఈ సమయంలో కచ్చితంగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అప్పటివరకు రేట్లు తగ్గుతాయని చూస్తున్నారు. ఎక్కువగా ఆభరణాలు, కాయిన్స్, బార్స్ రూపంలో కొనేందుకు చూస్తుంటారు.
బంగారం స్వచ్ఛతను బట్టి.. ఆభరణాలు వివిధ క్యారెట్లలో అందుబాటులో ఉంటాయి. కానీ 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ 91.6 శాతం గోల్డ్ ఉంటుంది. మిగతా శాతం లోహాల్ని కలుపుతారు. 24 క్యారెట్ల బంగారంతో ... ఆభరణాలు చేయడం చాలా కష్టం. ఇంకా క్యారెట్లు తగ్గుతున్న కొద్దీ బంగారం క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. అదే విధంగా రేట్లు కూడా తగ్గుతుంటాయని చెప్పొచ్చు.
ఇంకా ధరలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ఇవి ప్రాంతాల్ని బట్టి, షాపుల్ని బట్టి కూడా మారుతుంటాయి. పండగ సీజన్లో చాలా మంది ప్రముఖ జువెల్లర్స్లో గోల్డ్ కొనేందుకు చూస్తుంటారు. ఇక్కడ అన్ని జువెల్లర్స్లో కూడా ఆభరణాలపై వేర్వేరు రేట్లు ఉంటాయి. ముఖ్యంగా స్థానిక పన్ను రేట్లు, షిప్పింగ్ కాస్ట్స్ ఇలా ఎన్నో ప్రభావితం చేస్తుంటాయి. మరి ప్రముఖ జువెల్లర్స్ ధరల్ని చూద్దాం.
>> టాటా ప్రొడక్ట్.. తనిష్క్ జువెల్లరీలో 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర (సెప్టెంబర్ 27) గ్రాముకు రూ. 10,570 పలుకుతోంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, కల్యాణ్ జువెల్లర్స్లో రూ. 10,530 గా ఉంది. జోయాలుక్కాస్, ఖజానా జువెల్లరీ, లలితా జువెల్లరీ వంటి వాటిల్లో గోల్డ్ రేటు గ్రాముకు రూ. 10,585 పలుకుతోంది. అంటే తులం బంగారు ఆభరణాల ధర రూ. 1,05,850 గా ఉంది. దీనిపై తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ (3 శాతం) పడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa