తమిళనాడులోని కరూర్ జిల్లాలో టివికె (తమిళగ వెట్రి కళగం) అధినేత మరియు ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో తొక్కిసలాట జరగడంతో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడిన కారణంగా అనూహ్యంగా జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 16 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. తొలుత 33 మంది మృతులుగా ప్రకటించిన అధికారులు, చికిత్స పొందుతూ మరణించిన వారితో సంఖ్య 40కి చేరిందని ప్రకటించారు. పలువురు గాయపడినవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఈ ఘటన నేపథ్యంలో టివికె అధినేత విజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, సంఘటనకు ఆయన ప్రత్యక్షంగా బాధ్యుడు కాదని టివికె వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసుపై రాజకీయంగా కూడా చర్చలు మొదలయ్యాయి.
తాజాగా, మద్రాస్ హైకోర్టు ఈ కేసుపై కీలక తీర్పు ఇచ్చింది. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు జరిగిన విచారణలో టివికె అధ్యక్షుడు విజయ్పై నమోదైన కేసు విచారణను రద్దు చేసింది. దీనితో విజయ్కు తాత్కాలిక ఊరట లభించినప్పటికీ, ప్రజల ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa