ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో పక్కన ఉన్న గ్రామాలపై వరద ముప్పు పొంచి ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టింది.
నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలోని వాసునగర్, హిందూపూర్ గ్రామాల్లో వరద నీరు చొరబడే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని, స్థానిక అధికారులు ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. బోట్లు, వాహనాల సహాయంతో జనాన్ని తరలించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి.
ఇటు నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల గోదావరి నీటి ప్రవాహం భారీగా పెరిగింది. బాసర ప్రాంతంలో నది ఉప్పొంగిపోతుండటంతో, పక్కన ఉన్న కాలనీల్లోకి నీరు చేరే అవకాశం కనిపిస్తోంది.
ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa