అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కొన్ని కీలక ప్రకటనలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. గాజా వివాదానికి శాశ్వత శాంతిని చేకూర్చడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే, నోబెల్ శాంతి బహుమతిని తాను ఆశించడం లేదని కూడా ఆయన పేర్కొన్నారు.గాజాలో యుద్ధం ముగింపునకు తాము ప్రతిపాదించిన శాంతి సూత్రాలపై హమాస్ స్పందించడానికి మూడు, నాలుగు రోజుల గడువు ఇస్తున్నామని ట్రంప్ అన్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే ముగింపు విషాదకరంగా ఉంటుందని ఆయన అన్నారు. వైట్ హౌస్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాలు తెలిపారు.తమ ప్రతిపాదనపై భాగస్వామ్య పక్షాలన్నీ స్పందించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో సహా అరబ్ దేశాలు అంగీకరించాయని, ముస్లిం దేశాలు కూడా సానుకూలంగా స్పందించాయని ఆయన వెల్లడించారు. హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, వారు అంగీకరిస్తారో లేదో తెలియదని ఆయన అన్నారు. ఒకవేళ అంగీకరించకపోతే పరిస్థితులు విషాదకరంగా ఉంటాయని, ఇజ్రాయెల్ తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇప్పటికే 25 వేల మందికి పైగా హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని, వారి నాయకత్వాన్ని మూడుసార్లు నిర్మూలించామని ట్రంప్ తెలిపారు. ఇప్పుడు వారు శాంతిని కోరుకుంటే మంచిదని, లేకుంటే పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆయన హెచ్చరించారు.అదే సమయంలో, మాస్కో బెదిరింపులపై కూడా ట్రంప్ స్పందించారు. రష్యా వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రష్యా తీరంలో రెండు అణు జలాంతర్గాములను మోహరించినట్లు ఆయన తెలిపారు. అణ్వాయుధాలను ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే, తమ వద్ద ఇతర దేశాల కంటే అధికంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa