కూటమి పాలనలో అన్యాయానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని వైయస్ఆర్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బూల్ అహ్మద్ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైయస్ఆర్సీపీ కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్ బుక్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బుధవారం గాండ్లపెంట మండల వైస్ కన్వీనర్ ఆధ్వర్యం లో పార్టీ కార్యకర్తల కోసం రూపొందించిన డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్ కోడ్, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనికోసమే జగన్ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైయస్ఆర్సీపీ ప్రభుత్వమనే విషయం ప్రజల్లో బలంగా వినిపిస్తోందన్నారు. చివరకు అసెంబ్లీలో కూటమి ప్రజాప్రతినిధులు సైతం కంగారు పడుతున్న విషయం స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. కూటమి దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా వైయస్ఆర్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతులకు ఎరువుల సమస్య వస్తే వైయస్ఆర్సీపీశ్రేణులు ఎక్కడికక్కడ రోడ్డెక్కి, పోలీసు కేసులకు సైతం వెరవకుండా పోరాటం చేయబట్టే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఎరువులు దిగుమతి చేసుకుందని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడేది వైయస్ఆర్సీపీ మాత్రమేనన్నారు. ప్రతి సమస్యపై స్పందిస్తున్న పార్టీగా రాష్ట్ర ప్రజలంతా వైయస్ఆర్సీపీని చూస్తున్నారన్నారు. టీడీపీ మాదిరిగా ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే తమ పార్టీ బయటకు రాలేదన్నారు. సూపర్ సిక్స్లో ఏ పథకాలు వచ్చాయనేది ప్రజలకు తెలియంది కాదని మగ్బూల్ అహ్మద్ అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు భాస్కర్ రెడ్డి, ఎంపీపీ జగన్, రైతు సంఘం అధ్యక్షుడు సూర్య నారాయణ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు నరసింహా గౌడ్, ఎంపీటీసీ బాలు, ఫయాజ్ ఖాన్, నాగరాజు, లోకేష్, నూర్ మహ్మద్, శేఖర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, మైనుద్దీన్, యూత్ అధ్యక్షుడు రవిచంద్ర రెడ్డి, ఎస్సీ సెల్ నరసింహులు, ప్రభాకర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa