ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీజీకి నివాళులు అర్పించిన పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 05:04 PM

జాతిపిత మహాత్మా గాంధీ (జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. గాంధీ సిద్ధాంతాలు భావితరాలకు తెలియాలని అన్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా గాంధీజీకి ఉప ముఖ్యమంత్రి అంజలి ఘటించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన మార్గాన్ని అధ్యయనం చేయాలన్నారు. చేసేత రంగానికి ఊతమిద్దామంటూ డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ‘గాంధీజీ సిద్ధాంతాలు భావి తరాలకి తెలియాలి. మహాత్మా గాంధీజీ ప్రబోధించిన సత్యం, అహింస... మానవాళి నిత్య జీవనానికి బలమైన శక్తినిస్తాయి. గాంధీజీ వాటిని స్వయంగా ఆచరించి, వాటి శక్తిని చూపించారు. ఆ మహాత్ముడి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన అనుసరించిన మార్గాన్ని అధ్యయనం చేయాలి. ఆ స్ఫూర్తితో నేడు ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేయాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందరం స్వీకరించాలి. తద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం పెంచగలము. మన చేనేత రంగానికి ఊతం ఇద్దాం. సత్యం, అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా స్వాతంత్ర్య ఉద్యమాన్ని తనదైన శైలిలో ముందుండి నడిపించిన స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa