ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Thu, Oct 02, 2025, 05:48 PM

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన ఈ పండుగ, ప్రజలందరిలో ధైర్యం, వివేకంతో ముందుకు సాగే స్ఫూర్తిని నింపాలని ఆయన ఆకాంక్షించారు.గురువారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదికగా మోదీ తన సందేశాన్ని పంచుకున్నారు. "అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి విజయదశమి నిలువెత్తు నిదర్శనం. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరూ ధైర్యం, వివేకం, భక్తి మార్గంలో నిరంతరం ముందుకు సాగే స్ఫూర్తిని పొందాలని కోరుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు మోదీ తన పోస్ట్‌లో రాశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa