ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై స్పందించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 01:41 PM

చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa