ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ ఎవరి ముందు తలవంచదు.. అమెరికాకు పుతిన్ వార్నింగ్

international |  Suryaa Desk  | Published : Fri, Oct 03, 2025, 08:40 PM

నల్ల సముద్రంలోని సోచి రిసార్ట్ నగరంలో జరిగిన వాల్డాయ్ డిస్కషన్ గ్రూప్‌ సమావేశంలో పుతిన్ మాట్లాడారు. "భారత్ మన ఇంధన వనరులను వదులుకుంటుందా? అలా జరిగితే.. మనం కొన్న నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కొందరు ఆ నష్టాన్ని దాదాపు 9 నుంచి 10 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ భారత్ మన చమురును కొనడం ఆపకపోతే.. ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నష్టం కూడా ఆ మేరకే ఉంటుంది. (భారత ప్రజలు) తమను తాము ఎవరిచేత అవమానించబడటానికి ఎప్పటికీ ఒప్పుకౌరు. ప్రధాని మోదీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోరు" అని పుతిన్ అన్నారు.


అమెరికా విధించిన సుంకాల వల్ల భారత్ ఎదుర్కొంటున్న నష్టాలను.. రష్యా చమురు దిగుమతుల ద్వారా బ్యాలన్స్ చేయొచ్చని పుతిన్ అన్నారు. అంతేకాకుండా భారత్ సార్వభౌమ దేశంగా మరింత ప్రతిష్టను పొందుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని పుతిన్ ప్రశంసించారు. ఆయనను బ్యాలన్స్‌డ్, తెలివైన, జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే నాయకుడు అని అభివర్ణించారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక సంబంధం ఉందన్న పుతిన్.. భారత ప్రజలు దీన్ని మరచిపోరని నేను నమ్ముతున్నాన్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం.. తాము ఒక ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్టన‌ర్‌షిప్ గురించి ఒక ప్రకటన చేశామని.. అదే ఇరు దేశాల సంబంధాలకు సరైన నిర్వచణం అని అన్నారు.


పుతిన్ వార్నింగ్..


రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా భారం పడుతుందని పుతిన్ హెచ్చరించారు. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా వెళ్తాయన్నారు. భారత్‌‌తో ఉన్న వాణిజ్యం, పేమెంట్ సమస్యలను బ్రిక్స్ లేదా ఇతర మార్గాల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నాటో దేశాలన్నీ యుద్ధంలో తమతో పోరాడుతున్నాయన్నారు. ఇంకా ఈ విషయాన్ని దాచలేదన్నారు. యుద్ధం ఇంకా కొనసాగడానికి యూరప్ కారణమని చెప్పారు. యుద్ధాన్ని ఆపడానికి బ్రిక్స్, అరబ్ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ ప్రశంసించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa