ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ధ్యేయంగా ఐటీ చట్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా, వారి సిఫార్సులు న్యాయస్థానాల్లో నిలబడవని వైయస్ఆర్సీపీస్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... కేంద్ర పరిధిలో ఉన్న ఐటీ చట్టానికి మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండవని తెలిసీ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడం అవివేకమైన చర్యగా పొన్నవోలు సుధాకర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న ప్రభుత్వ చర్యలు ఎప్పటికీ నెరవేరవని గట్టిగా బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ ఇన్ఫర్మేషన్కి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి విష ప్రచారం చేశారని, ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా వారిమీదనే పెట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని, వైయస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు. వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ విధించడంపై పలుమార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్రెడ్డి గుర్తు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa