ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్‌కు షాక్.. టీమిండియా వన్డే కెప్టెన్‌గా గిల్.. ఆస్ట్రేలియా టూర్‌కు జట్టు ప్రకటన

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 10:00 PM

ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ప్రమోషన్ ఇచ్చింది. గత కొన్నేళ్లుగా వన్డే టీమ్‌ను నడిపిస్తున్న రోహిత్ శర్మ ఇకపై కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. అతడితో పాటు విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. వన్డే ప్రపంచకప్ 2027 నాటికి పటిష్ట జట్టును తయారు చేయడమే లక్ష్యంగా భారత సెలక్షన్ కమిటీ కెప్టెన్సీ మార్పు నిర్ణయం తీసుకుంది. ఇక వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది.


ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు:


శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్‌), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైశ్వాల్


ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:


సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్‌


ఆస్ట్రేలియా- భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్..


వన్డే సిరీస్..


తొలి వన్డే: అక్టోబర్ 19- పెర్త్ స్టేడియం


రెండో వన్డే: అక్టోబర్ 23- అడిలైడ్ ఓవల్


మూడో వన్డే: అక్టోబర్ 25- సిడ్నీ క్రికెట్ స్టేడియం


టీ20 సిరీస్..


తొలి టీ20: అక్టోబర్ 29- కాన్‌బెర్రా


రెండో టీ20: అక్టోబర్ 31- మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్


మూడో టీ20: నవంబర్ 2- హోబార్ట్


నాలుగో టీ20: నవంబర్ 6- గోల్డ్ కోస్ స్టేడియం


ఐదో టీ20: నవంబర్ 8- గబ్బా క్రికెట్ స్టేడియం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa