ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో ఈతకు వెళ్లి కొట్టుకుపోయిన నలుగురు విదేశీయులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 05, 2025, 06:24 PM

విశాఖ, యారాడ బీచ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు దిగిన నలుగురు విదేశీయులు నీటిలో కొట్టుకుపోయారు. లైఫ్ గాడ్స్ వీరిలో ఇద్దరిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఇద్దరు గల్లంతయ్యారు. బయటకు తీసుకువచ్చిన వారికి లైఫ్ గాడ్స్ సీపీఆర్ చేశారు. ఇద్దరిలో ఓ వ్యక్తి సీపీఆర్ కారణంగా బతికాడు. మరో వ్యక్తి చనిపోయాడు. రెస్క్యూ సిబ్బంది సముద్రంలో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు.ఇటలీకి చెందిన మొత్తం 16 మంది పర్యాటకులు యారాడ బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అందరూ సముద్రంలో దిగి ఈత కొడుతూ ఉండగా అలల ధాటికి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, యారాడ బీచ్ లో తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. ఈత కోసం సముద్రంలోకి వెళ్లిన చాలా మంది గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనూ 8మంది ఇటలీ పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోయారు. లైఫ్ గార్డ్స్ సకాలంలో స్పందించటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa