ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ పరిపాలనకు పచ్చకామెర్లతో విద్యార్థినుల మృతి సిగ్గుచేటు వ్యవహారం కాదా చంద్రబాబు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 01:59 PM

మన్యం జిల్లాలో పచ్చకామెర్లతో విద్యార్థినుల మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబూ.. పాలనలో మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మీకు కనికరం కూడా లేదు’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైయ‌స్‌ జగన్‌ నిలదీశారు. ‘‘పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వోప్లాంటు పాడవడంతో కలుషిత నీరు తాగడం మూలాన, పచ్చకామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా?. 611 మంది చదువుతున్న స్కూల్‌లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోరా?. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా?’’ అంటూ వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa