కర్ణాటకలోని చింతామణిలో జస్టిస్ వి. గోపాల గౌడ అమృత మహోత్సవంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. కార్మికుడికి ఉద్యోగం కేవలం జీతం కాదని, అది వారి గౌరవం, భద్రత అని అన్నారు. కార్మికుడిని అక్రమంగా తొలగిస్తే పరిహారం బదులు ఉద్యోగం పునరుద్ధరణ తప్పనిసరి అని జస్టిస్ గోపాల గౌడ నిరూపించారన్నారు. జస్టిస్ గోపాల జనసేన సిద్ధాంతాలకు బలమైన మద్దతుదారుడని, రాజ్యాంగ ఉల్లంఘనలపై గళం ఎత్తుతున్నారని కొనియాడారు. భూ సేకరణ చట్టం, నల్లమల యురేనియం తవ్వకాలపై ఆయన దిశానిర్దేశం తమ పోరాటానికి బలంగా మారిందని పవన్ అన్నారు. రాజకీయాల్లోని తొలి రోజుల్లో ఓడిపోయినప్పుడు, జస్టిస్ గోపాల గౌడ తనను భుజం తట్టి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa